న్యూఢిల్లీ : మదర్సాలాల కూల్చివేత, అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీని గన్పౌడర్ ఉపయోగించి పేల్చివేయాలని పిలుపు ఇచ్చిన వివాదాస్పద స్వామీజీ యతి నర్సింగానంద్ సరస్వతిపై కేసు నమోదైంది. హిందూ మహాసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు యతి నర్సింగానంద్ సస్వతి ఆదివారం అలీఘఢ్ను సందర్శించారు.
గుర్తింపులేని మదర్సాలపై యూపీ ప్రభుత్వం చేపట్టిన సర్వేను ప్రస్తావిస్తూ మదర్సా వంటి సంస్ధలు ఉండరాదని, చైనా తరహాలో అన్ని మదర్సాలను గన్పౌడర్తో పేల్చివేయాలని అన్నారు. మదర్సాల్లో విద్యార్ధులందరినీ క్యాంపులకు తరలిస్తే వారి మెదళ్ల నుంచి ఖురాన్ అని పిలిచే వైరస్ను తొలగించాలని వ్యాఖ్యానించారు. యతి నర్సింగానంద్ వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన వీడియో బయటకు రావడం కలకలం రేపింది.
మదర్సాల తరహాలోనే అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)ని కూడా పేల్చివేయాలని, విద్యార్ధులను డిటెన్షన్ సెంటర్లకు పంపి వారి మెదళ్లను ప్రక్షాళన చేయాలన్నారు. అలీఘఢ్లో ఓ మతానికి చెందిన విద్యా సంస్ధలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్పై గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ల కేసు నమోదైందని ఎస్పీ కుల్దీప్ సింగ్ గుణవత్ పేర్కొన్నారు. గతంలో విద్వేష ప్రసంగం చేశారనే ఆరోపణలపై యతి నర్సింగానంద్ సరస్వతిని హరిద్వార్లో అరెస్ట్ చేసి ఆ తర్వాత విడుదల చేశారు.