IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(214 నాటౌట్: 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లు) రెండో డబుల్ సెంచరీ కొట్టాడు. అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(68 నాటౌట్ : 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇద్దరూ దూకుడుగా ఆడుతున్న సమయంలోనే 430/4 వద్ద భారత కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడో రోజు టీ20 తరహా ఆటతో సెంచరీ బాదిన ఈ హిట్టర్.. నాలుగో రోజు ఇంగ్లండ్ బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. జో రూట్ బౌలింగ్లో సింగిల్ తీసి యశస్వీ ద్వి శతకం పూర్తి చేసుకున్నాడు. లంచ్ తర్వాత దూకుడు పెంచిన యశస్వీ.. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లతో తన తడాఖా చూపించాడు. తొలి సెషన్లో శుభ్మన్ గిల్(91) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఈ డాషింగ్ బ్యాటర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
2⃣0⃣0⃣ & more reasons to celebrate this! 👏 👏
What’s yours❓ 🤔
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/LPOEEASUAF
— BCCI (@BCCI) February 18, 2024
Vizag ✅
Rajkot ✅Make way for the 𝘿𝙤𝙪𝙗𝙡𝙚 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙞𝙤𝙣! 💯💯
Take A Bow, Yashasvi Jaiswal 🙌 🙌
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/fpECCqKdck
— BCCI (@BCCI) February 18, 2024
అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(68 నాటౌట్ : 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో సింగిల్ తీసి యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. దాంతో, భారత్ 4 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. ప్రస్తుతానికి టీమిండియా 538 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Making it count on Test debut & how! 👌 👌
Sarfaraz Khan notches up his 2⃣nd half-century in the match 👏 👏
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/q10DCCCHED
— BCCI (@BCCI) February 18, 2024
ఓవర్నైట్ స్కోర్ 196/2 తో నాలుగోరోజు ఆట కొనసాగించిన భారత్ తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఎంతో ఓపికగా ఆడిన శుభ్మన్ గిల్(91) చేజేతులా సెంచరీ మిస్ చేసుకున్నాడు. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(27)తో సమన్వయ లోపంతో అతడు రనౌట్గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే కుల్దీప్ను రెహాన్ అహ్మద్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత యశస్వీతో జత కలిసిన సర్ఫరాజ్ ధాటిగా ఆడాడు. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు 172 పరుగులు జోడించారు. దాంతో, రోహిత్ సేన భారీ ఆధిక్యం సాధించింది.