యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 2,51,339 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలి పారు. ప్రధాన బుకింగ్ ద్వారా 32,336, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 9,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, నిత్య కైంకర్యాల ద్వారా 600, సుప్రభాతం ద్వారా 100, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 1,420, వ్రతపూజల ద్వారా 2,500,
కల్యాణ కట్ట టిక్కెట్ల ద్వారా 2,000, ప్రసాద విక్రయం ద్వారా 1,47,800, వాహన పూజల ద్వారా 2, 800, టోల్ గేట్ ద్వారా 710, అన్నదాన విరాళం ద్వారా 4,361,సువర్ణ పుష్పార్చన ద్వారా 37,220, యాదరుషి నిలయం ద్వారా 6,400, పాత గుట్ట నుంచి 3,060 మొత్తంగా ఖజానాకు రూ.2,51,339 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.