యాదగిరిగుట్ట రూరల్, జనవరి 18 : ప్రమాద బీమా టీఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కంఠంగూడేనికి చెందిన పార్టీ కార్యకర్త గండ్ల సోమరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు పార్టీ సభ్యత్వం ఉన్నందున ప్రమాద బీమా కింద రూ. 2లక్షలు మంజూరయ్యాయి. ఆ చెక్కును మృతుడి భార్య యాదమ్మకు ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకునేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మారెడ్డి కొండల్రెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు బాధితులకు అండగా ఉంటాం
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో నష్టపోయిన రోడ్డు బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయం, ఆలయ వైకుంఠద్వారం వద్ద ఆంజనేయస్వామి ప్రాంగణంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన 11 మందిలో ఐదుగురు లబ్ధిదారులకు నివాస స్థల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేరుస్తారని తెలిపారు. యాదాద్రి ఆలయం మార్చి 28న పునః ప్రారంభం కానున్నదని, గుట్ట పరిసర ప్రాంతంలో ఎంతో మంది యువతకు ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు.