ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాల్లో 16,854 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్తోపాటు శానిటైజర్ను అందుబాటులో ఉంచనున్నారు.రామగిరి, అక్టోబర్ 23 : ఇంటర్మీడియట్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. 108 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు చెందిన 16,854 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, డీఈఓ బి.భిక్షపతి శనివారం పలు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి సూచనలిచ్చారు.
రామగిరి, అక్టోబర్ 23 : ఇంటర్మీడియట్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. 108 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు చెందిన 16,854 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, డీఈఓ బి.భిక్షపతి శనివారం పలు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి సూచనలిచ్చారు.