యాదాద్రి, అక్టోబర్ 21 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం నిత్యపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పంచామృతాలతో నిజాభిషేకంతో స్వామివారి కైంకర్యాలు శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించి తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం జరిపించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నర పాటు కల్యాణతంతు జరిపారు. సాయంత్రం వేళ స్వామి, అమ్మవారి అలంకార జోడు సేవలను నిర్వహించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. కొండపైన క్యూ కాంప్లెక్స్లోని ప్రత్యేక గదిలో కొలువైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యపూజలు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ. 8,61,714 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 64,316
రూ.100 దర్శనం టిక్కెట్ 25,000
నిత్య కైంకర్యాలు 600
సుప్రభాత సేవ 600
వేద ఆశీర్వచనం 5,160
క్యారీబ్యాగుల విక్రయం 1,650
టెంకాయల విక్రయం 30,000
వ్రత పూజలు 33,500
కల్యాణకట్ట టిక్కెట్లు 15,000
ప్రసాద విక్రయం 3,09,625
వాహన పూజలు 8,700
టోల్గేట్ 570
అన్నదాన విరాళం 23,346
సువర్ణ పుష్పార్చన 74,660
యాదరుషి నిలయం 49,100
పాతగుట్ట నుంచి 19,655
గోపూజ 100
ఇతర విభాగాలు 1,73,900