చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ కొత్త కొత్త ప్రొడక్టులను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంది. గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో Mi 11 సిరీస్లో ఒకేసారి మూడు మోడళ్లు Mi 11 ఆల్ట్రా, Mi 11 ప్రొ, Mi 11 లైట్ 5Gలను సోమవారం చైనాలో ఆవిష్కరించింది. వీటితో పాటు ఎంఐ స్మార్ట్బ్యాండ్ 6ను కూడా రిలీజ్ చేసింది.ప్రపంచంలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 780 జి ప్రాసెసర్తో వస్తోన్న మొట్టమొదటిది ఫోన్ ఎంఐ 11 లైట్ కావడం విశేషం. షియోమీ ఎంఐ11 సిరీస్ ఫోన్లను భారత్లో ప్రవేశపెట్టలేదు. ఫ్లాగ్షిప్ సిరీస్ త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.
షియోమీ Mi 11 ఆల్ట్రా
డిస్ప్లే:6.80 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా:20 ఎంపీ
రియర్ కెమెరా:50+48+48 ఎంపీ
ర్యామ్:12జీబీ
స్టోరేజ్:256జీబీ
బ్యాటరీ:5000mAh
ఓఎస్:ఆండ్రాయిడ్ 11
షియోమీ Mi 11 ప్రొ
డిస్ప్లే:6.81 అంగుళాలు
రియర్ కెమెరా: 50+13+8 ఎంపీ
బ్యాటరీ:4970mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
షియోమీ Mi 11 లైట్
డిస్ప్లే:6.55అంగుళాలు
ఫ్రంట్ కెమెరా:20 ఎంపీ
రియర్ కెమెరా:64+8+5
ర్యామ్:8జీబీ
స్టోరేజ్:128జీబీ
బ్యాటరీ:4250mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10