న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. ఇటీవలే స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసిన నిఖత్.. ప్రపంచ టోర్నీ ట్రయల్స్లోనూ అదరగొట్టింది. మూడు రోజుల నుంచి జరుగుతున్న ట్రయల్స్ బౌట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ ఇందూరు బాక్సర్ బుధవారం 52 కిలోల విభాగంలో మీనాక్షి (హర్యానా)పై 7-0 విజయంతో మెగాటోర్నీకి బెర్తు ఖరారు చేసుకుంది. ఆది నుంచే పదునైన పంచ్లతో విరుచుకుపడిన నిఖత్..ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగింది. ఇస్తాంబుల్ వేదికగా మే నెలలో జరుగనున్న ఈ ప్రపంచ టోర్నీకి నిఖత్తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై, నీతు, అనామికా, శిక్ష, మనీశ, జాస్మైన్, పర్వీన్, అంక్షిత బొరో, సవిటీ బూర, పూజ రాణి, నందిని అర్హత సాధించారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్లోనే మెగాటోర్నీ జరుగాల్సి ఉన్నా..కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది.