Womens T20 WC : భారీ టార్గెట్ ఛేదనలో టీమిండియా పెద్ద వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (8) ఔట్ అయింది. బెల్ ఓవర్లో క్యాథెరిన్ సీవర్ బ్రంట్ క్యాచ్ పట్టడంతో షఫాలీ వెనుదిరిగింది. 29 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న జెమీమా రోడ్రిగ్స్ క్రీజులోకి వచ్చింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడుతోంది. ఏడు ఓవర్లు మగిసే సరికి భారత్ స్కోర్.. 43/1.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 151 రన్స్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీ, అమీ జోన్స్(40) రాణించారు. భారత బౌలర్లో రేణుకా సింగ్ ఐదు వికెట్లు తీసింది.