నర్సంపేట రూరల్, మార్చి 15: మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతూ, కీర్తిని గడించడంతో పాటు సామాజిక సేవలో ముందుండాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా క్రీడోత్సవాల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందించారు. ఇక్కడ పెద్ది మాట్లాడుతూ నిత్యం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే మహిళలు క్రీడల్లో సత్తాచాటడం అభినందనీయమని కొనియాడారు. నియోజకవర్గంలోని పల్లెలన్నీ అభివృద్ధి పథంలో దూసుకపోతున్న తరుణంలో స్త్రీశక్తిని పెంపొందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డిమాండ్ ఉన్న ప్రతీ గ్రామంలో కొత్త మహిళా సమైక్య భవనాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ-గోపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మొరాల మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్, గోనె యువరాజ్ పాల్గొన్నారు
రాష్ట్రంలో ఆస్తిపాస్తుల్లేని ఎమ్మెల్యేను నేనే..
రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవచేయడానికి, నియోజకవ ర్గాన్ని అభివృద్ధి చేయడానికే తప్ప ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదని రాష్ట్రంలోనే నిరుపేద ఎమ్మెల్యేను తానేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభచూపిన వారికి బుధవారం ఖానాపురంలోని ఐకేపీ కార్యాలయ ఆవరణలో బహుమతులను అందించారు. ఇక్కడ పెద్ది మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని మహిళలందరూ ఉత్సాహంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోనే మరెక్కడా లేనివిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 800మందితో క్రీడాపోటీలు నిర్వహించానన్నారు. ప్రభుత్వ సహకారంతో మరింత శక్తిమంతులు కావాలని కోరారు. మహిళల కోసం తన శక్తిమేర కృషి చేస్తున్నానని వారి ఆశీర్వాదం తనకు కావాలని కోరా రు.
నాలుగేళ్లలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి మన కళ్లముందు కనిపిస్తున్నదన్నారు. చాలాచోట్ల సీసీ, బీటీ రోడ్లు మంజూరు చేయించానని ఉగాది నాటికి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం అనారోగ్యం బారిన పడిన 10మంది లబ్ధిదారులకు రూ.2.72 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఖానాపురం, అశోక్నగర్, కొత్తూరు, రంగాపురం గ్రామాల్లో పలువురి బాధిత కుటుంబాలను పరామర్శించా రు. ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీ ఫ్లోర్లీడర్ స్వప్న, జడ్పీటీసీ బత్తిని స్వప్న, వైస్ ఎంపీపీ రామసాయం ఉమారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, ఎంపీడీఓ సుమనావాణి, ఏపీఎం సుధాకర్, చైతన్యమండలి సమాఖ్య అధ్యక్షురాలు కవిత, ఎంపీటీసీ భారతి, కవిత, సీసీలు కరుణ పాల్గొన్నారు.