న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది. 36 ఏళ్ల మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఆ ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను నవీన్ సింగ్ భండారి, బిశ్వ మోహన్ ఆచార్య, అక్షయ్ తనేజాలుగా గుర్తించారు. అత్యాచారం జరిగిన నాలుగు గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మాదిపూర్ పోలీస్ స్టేషన్లో రేప్కు సంబంధించిన ఫిర్యాదు నమోదు అయినట్లు డిసీపీ ఘన్శ్యామ్ భన్సాల్ తెలిపారు. 376డీ, 328 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.