హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉద్యమాన్ని ప్రారంభించడంతోపాటు దా న్ని గమ్యస్థానానికి చేర్చి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మహానాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు ట్విట్టర్లో సోమవారం ప్రశంసించారు. ఉద్యమాన్ని ప్రారంభించి.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చి.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహానాయకుడు కేసీఆర్ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రశంసించారు. సంక్షేమ పథకాల్లో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ అని టీఆర్ఎస్ ఒమన్, బహ్రెయిన్శాఖ ల అధ్యక్షులు ఈగపూరి మహిపాల్రెడ్డి, రాధారపు సతీశ్కుమార్ ప్రశంసించారు. ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లోని యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.