భారత్లో నిరుడు జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా.. స్టేడియంలో అభిమానులు తమ ఫోన్ టార్చ్లను ఆన్ చేసినప్పుడు ఆ లైట్ల వెలుగులో భారత సారథి హర్మన్ప్రీత్ కౌర్ బంతిని అందుకుంటుండగా తీసిన ఫొటో ఇది. ప్రముఖ క్రికెట్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ మాథ్యూ లూయిస్ తీసిన ఈ చిత్రం.. 2025కు గాను ‘విజ్డెన్ ఫొటోగ్రాఫ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. లూయిస్ గతంలో 2014, 2022లోనూ ఈ అవార్డుకు ఎంపికవగా ఇది మూడోవది కావడం విశేషం.