న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు. ఐదు రాష్ట్రాలకు వెళ్లడానికి తాము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించారు. 105 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతున్నదని ఆయన చెప్పారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయాలని తాము ప్రచారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.