Chirag Paswan Fire | ఢిల్లీలోని 12-జన్పథ్ బంగళాను జప్తు చేసుకునే విషయమై తమ కుటుంబాన్ని ఎందుకు అవమాన పర్చారని లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ప్రశ్నించారు. తాము ఆ ఇంటిని ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. అధికారుల తీరు విచారకరం అని, తనను అవమానించారని ఆరోపించారు.
ఎల్జేపీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ సుదీర్ఘకాలం 12-జన్పథ్లో నివాసం ఉన్నారు. 2020లో ఆయన మరణం తర్వాత కూడా పాశ్వాన్ కుటుంబ సభ్యులు ఆ బంగళాలోనే ఉండేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, 1990లో రాం విలాస్ పాశ్వాన్కు ఈ బంగళాను కేటాయించారు.
ఆ బంగళా ఖాళీ చేయించడానికి అధికారులు అనుసరించిన మార్గం తనకు బాధ కలిగించిందని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. తానెప్పుడూ 12-జన్పథ్ బంగళాను ఆక్రమించుకోవాలనుకోలేదన్నారు. చట్టం పట్ల తమ కుటుంబానికి గౌరవం ఉందని అన్నారు. తాము ఆ బంగళా ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. ఈ రకంగా తమను ఎందుకు అవమానించారని ప్రశ్నించారు. ఈ వ్యవహరాలన్నీ బీహారీలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
చిరాగ్ పాశ్వాన్కు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మద్దతు పలికారు. పాశ్వాన్ కుటుంబ సభ్యుల నుంచి12-జన్పథ్ బంగళాను అధికారులు స్వాధీనం తీరును తప్పుబట్టారు. రాం విలాస్ పాశ్వాన్ తన చివరి రోజు వరకు బీజేపీకి నమ్మిన బంటు హనుమాన్లా వెన్నంటి ఉన్నారని గుర్తు చేశారు. కానీ హనుమంతుడు నివాసం ఉన్న ఈ బంగళా స్వాధీనం చేసుకోవడం అనుసరించి తీరు అనుచితంగా ఉందన్నారు.