చంద్రగుప్తమౌర్యుడు నంద రాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా కలిగిన గ్రంథం ఈ కింది వాటిలో ఏది? 1) కౌటిల్యుని అర్థశాస్త్రం 2) విశాఖదత్తుని ముద్రారాక్షసం 3) పతంజలి మహాభాష్యం 4) మెగస్తనీస్ ఇండికా
తన పాలన చివరిదశలో జైనమతాన్ని అవలంబించినది ఎవరు? 1) మహాపద్మనంద 2) జయధవళ 3) పరిశిష్టపర్వన్ 4) ఏదీకాదు
చంద్రగుప్త మౌర్యుడు తన జీవిత చివరి దశలో జైనమతాన్ని అవలంబించాడని తెలిపే జైనగ్రంథం? 1) రత్నమాలిక 2) జయధవళ 3) పరిశిష్ఠపర్వన్ 4) ఏదీకాదు
కింది శాసనాల్లో పశ్చిమ భారతం (సౌరాష్ట్ర) పై చంద్రగుప్త మౌర్యుని విజయాన్ని ధృవపరుస్తుంది? 1) రుద్రదమనుని జునాగఢ్ శిలాశాసనం 2) అశోకుని సోపారా శిలాశాసనం 3) అశోకుని గిర్నార్ శిలాశాసనం 4) అశోకుని సారనాథ్ శిలాశాసనం
చంద్రగుప్తమౌర్యుడు ఓడించినది? 1) సెల్యుకస్ 2) అలెగ్జాండర్ 3) పోరస్ 4) ఎవరూ కాదు
చంద్రగుప్త-2 పాలనా కాలంలో ఇండియాను దర్శించిన విదేశీయుడు? 1) పాహియాన్ 2) వసుమిత్ర 3) హ్యుయాన్త్సాంగ్ 4) ఇత్సంగ్
ఏ ప్రాంతంలో అశోకుని ప్రధానమైన ప్రభుత్వ శిలాశాసనాలు ఉన్నాయి? 1) గిర్నార్ 2) అలహాబాద్ 3) బరాబర్ 4) ఢిల్లీ
అశోకుని ధర్మాన్ని గురించి కింది వాటిలో సరైనది? 1) అతడు బౌద్ధమత సూత్రాలను సంపూర్ణంగా ప్రభోధించాడు 2) బౌద్ధమతాన్ని స్వీకరించాల్సిందని, అతడు ప్రజలను ఒత్తిడిచేశాడు 3) నియామకాలకై అతడు బౌద్ధమత సందేశాన్ని ప్రభోధించిన వారిని ఎన్నుకొన్నాడు 4) తల్లిదండ్రులు, పెద్దలు, మతగురువులు గౌరవించబడాలని అతడు ప్రభోదించాడు
కింది వాటిలో ఏ శిలాశాసనం యుద్ధం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తుంది? 1) 13వ శిలాశాసనం 2) కళింగ శిలాశాసనం 3) జౌగధ శిలాశాసనం 4) 10వ శిలాశాసనం
అశోకుడు మానవతా దృక్పథంతో ప్రతి సంవత్సరం కొంతమంది ఖైదీలను కింది వాటిలో ఏ సందర్భంలో విడుదల చేసేవారు? 1) పుట్టినరోజు 2) కళింగను జయించిన రోజు 3) పట్టాభిషుక్తుడైన రోజు 4) బౌద్ధమతానికి పరివర్తన చెందిన రోజు
అలహాబాద్ అశోక స్థూపం ఎవరికి సంబంధించిన సమాచారం ఇస్తుంది? 1) చంద్రగుప్త మౌర్య 2) చంద్రగుప్త-1 3) సముద్రగుప్త 4) చంద్రగుప్త-2
అశోకుని కాలంలో నిర్వహించిన బౌద్ధ సమావేశం? 1) మొదటిది 2) రెండవది 3) మూడవది 4) నాలుగవది
అశోకుని స్తంభాలకు ఎర్రని ఇసుకరాయిని ప్రధానంగా ఎక్కడ నుంచి తవ్వి తీశారు? 1) తక్షశిల 2) చునార్ 3) అరావళీ కొండలు 4) 2, 3
1837లో అశోకుని కాలపు లిపిని మొట్టమొదటగా విడమర్చి అర్థం చెప్పినది ఎవరు? 1) విలియం జోన్స్ 2) జేమ్స్ ప్రెస్ సెప్ 3) మెకాలే ప్రభువు 4) జాన్ మార్షల్
కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం ముఖ్యంగా దేనిని గురించి వివరిస్తుంది? 1) విదేశాంగ విధానం 2) తత్వశాస్త్రం 3) రాజనీతి పద్ధతులు- సిద్ధాంతాలు 4) రాజుల గొప్పతనం
బౌద్ధ సన్యాసులను పీడించిన ప్రాచీన భారతదేశపు ఫంఢీ నిష్ట బ్రాహ్మణరాజు కింది వారిలో ఎవరు? 1) పుష్యమిత్ర శుంగుడు 2) హర్షవర్ధనుడు 3) ధనదేవుడు 4) మొదటి రుద్రదమనుడు
క్రీ.శ. 1, 2 శతాబ్దాల నాటి భారత్, రోమన్ వర్తకానికి సంబంధించినది ఏది? 1) అరికమేడు తవ్వకాలు 2) ఇటలీలో భారతదేశ నాణేలు లభించడం 3) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియాన్ సీ 4) భారత్లో రోమ్ దేశం నాణేలు లభించడం
కింది వాటిలో సరికానిది? 1) శకులు- మొదటి రుద్రదమనుడు 2) శాతవాహనులు- పులోమావి 3) ఇండో గ్రీకులు- మీనాండర్ 4) పార్థియన్లు- నాగసేనుడు
భారత్లో ‘క్షత్రిప’ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? 1) కుషాణులు 2) శకులు 3) పార్థియన్లు 4) ఇండో గ్రీకులు
విక్రమశకం ప్రారంభమైన సంవత్సరం? 1) క్రీ.పూ. 324 2) క్రీ.పూ. 78 3) క్రీ.పూ. 58 4) క్రీ.పూ. 28