మొయినాబాద్, ఫిబ్రవరి 28: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడానికి ఒక్క రోజు ముందే (ఈ నెల 23 న) హైదరాబాద్కు చెందిన ప్రతీక్, ఉక్రెయిన్కు చెందిన లియుబోవ్ ఆ దేశంలో పెండ్లి చేసుకొన్నారు. విందు కోసమని అదే రోజు కుటుంబంతో కలిసి హైదరాబాద్ చేరుకొన్నారు. మరుసటి రోజే ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. దీంతో భారీ ప్రమాదం నుంచి తప్పించుకొన్నామని ఆ కుటుంబాలు ఊపిరి పీల్చుకొన్నాయి. ఆదివారం ఆ నవదంపతుల రిసెప్షన్ జరిగింది. ఈ విందుకు చిలుకూరు ప్రధానార్చకుడు సీఎస్ రంగరాజన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.