రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సంస్థ
హైదరాబాద్, మార్చి 9: డాటా సెంటర్, క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ వెబ్ వెర్క్స్.. హైదరాబాద్లో రూ.500 కోట్లతో ఓ డాటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ భవనాన్ని సొంతం చేసుకున్న ఈ సంస్థ.. దాన్నిక్కడ తమ తొలి డాటా సెంటర్గా మార్చనున్నది. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నది. ఈ ఏడాది ఆఖరుకల్లా దాదాపు 100 మందిని ఉద్యోగాల్లోకీ తీసుకోనున్నట్టు సమాచారం. తెలంగాణలో ఈ డాటా సెంటర్ను తెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సంస్థ వ్యవస్థాపక సీఈవో నిఖిల్ రాఠీ అన్నారు. ఐటీ, బీమా, బయోటెక్, ఆర్థిక, సేవా రంగాల్లో ఇక్కడ తమకు ఆకర్షణీయమైన అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్లో 10 ఎంవీఏ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని చూస్తున్నది. ఐటీ లోడ్ 6 మెగావాట్లుగా ఉంటుందని అంచనా.