దుబాయ్: ఆసియాకప్ సూపర్ 4 స్టేజ్లో.. ఇండియా రేపు పాకిస్థాన్తో ఆడనున్నది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే పోరు కోసం టీమిండియా క్రికెటర్లు తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కఠోర సాధన చేస్తున్నాడు. పాక్తో మ్యాచ్కు ముందు అతను దుబాయ్ మైదానంలో చమటలు చిందిస్తున్నాడు. హై ఆల్టిట్యూడ్ మాస్క్ను ధరించి మరీ కోహ్లీ శిక్షణలో పాల్గొన్నాడు. గ్రౌండ్లో పరుగులు తీసిన విరాట్ ఆ సమయంలో తన ముఖానికి హై ఆల్టిట్యూడ్ మాస్క్ను ధరించాడు. విరాట్ ఫ్యాన్స్ క్లబ్ తమ ట్విట్టర్ అకౌంట్లో.. కోహ్లీ శిక్షణకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేశారు. ఇటీవల పెద్దగా ఫామ్లో లేని కోహ్లీ.. తాజాగా జరుగుతున్న ఆసియా కప్లో పర్వాలేదనిపించాడు. ఆడిన రెండు మ్యాచుల్లో అతను 94 రన్స్ చేశాడు. హాంగ్కాంగ్పై 59 రన్స్ చేయగా, పాకిస్థాన్తో మ్యాచ్లో 35 రన్స్ చేశాడు. ఇక రేపటి మ్యాచ్లో అతనెలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.
@imVkohli Wearing A Mask During the Practice Session Before The Sunday's Match 😷💙
📸: @xtratimeindia #ViratKohli #AsiaCup pic.twitter.com/CfQZsr1E89
— virat_kohli_18_club (@KohliSensation) September 2, 2022