కోస్గి, జనవరి 14: కోస్గి ప్రభుత్వ దవాఖాన నిర్మాణం పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కోస్గిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశమంతా అమలుకావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను దేశమంతా విస్తరింపజేస్తున్నారన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటయ్యాక మొదటిసభ ఈనెల 18న ఖమ్మంలో నిర్వహిస్తున్నారని, కార్యకర్తలు, నాయకులు పెద్దమొత్తంలో హాజరుకావాలని కోరారు.
కోడంగల్ నియోజకవర్గ అభివృద్ధ్దికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందన్నారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికిరూ. 22కోట్లు, నాలుగున్నర కోట్లు గ్రామాల్లో సీసీరోడ్లకు మంజూరు చేసిందన్నారు. కోస్గి మున్సిపాలిటీకి రూ.13.5కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. సంక్రాంతి తరువాత కోస్గి పట్టణ రోడ్డువిస్తరణ పనులు ప్రారంభమౌతాయని అందరూ సహకరించాలని కోరారు. ఈనెల 18నుంచి ప్రారంభమయ్యే కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు మాస్ట్టర్ శ్రీనివాస్, బాలేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజేశ్, వెంకటనర్సింహులు, బాలరాజు తదితరులున్నారు.
మద్దూర్ (కొత్తపల్లి) జనవరి 14: అభివృద్ధ్ది పనులను త్వరతిగతిగ పూర్తి చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సూచించారు. శనివారం కొత్తపల్లి,మద్దూర్ మండలంలో పర్యటించారు. దుప్పటిగట్టు గ్రామంలో గతనెలలో మరణించిన భగవంత్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త బొబ్బిలి తిరుపతిరెడ్డి తండ్రి రాంరెడ్డి శనివారం మృతిచెందగా తిరుపతిరెడ్డిని పరామర్శించారు. గోనెల వెంకటమ్మ అనారోగ్యంతో మృతిచెందగా ఆమె వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మద్దూర్ మండల కేంద్రంలోని బాలికల పాఠశాల, గురుకుల పాఠశాల భవన నిర్మాణం పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం షా గార్డెన్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇతర ప్రాంతానికి తరలించేదిలేదని, సౌకర్యాలు ఉన్నభవనంలోకి మా ర్చి త్వరలో సొంత భవనం నిర్మించేందుకు సీఎం కేసీఆర్తో మా ట్లాడి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. మద్దూర్లోని రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేస్తామని, మండల అభివృద్ధి ప నులను వెంటనే పూర్తి చేస్తామ న్నారు. కార్యక్రమంలో కోస్గి మా ర్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షు డు పెద్దవీరారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, బీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు వెంకటయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.