హిమాయత్నగర్ ( హైదరాబాద్) : సీఎం కేసీఆర్ (CM KCR) ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) పై ఎన్నికల కమిషన్(Election Commission) కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్ (Mla Danam Nagendar) తెలిపారు. బుధవారం హిమాయత్నగర్ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ నెల 30న జరిగే పోలింగ్లో ఓటుతో తగిన గుణపాఠం చేప్పడం ఖాయమన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మందికిపైగా ప్రజలు వివిధ సంక్షేమ పథకాలతో లబ్దిపొందారని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గ్యారంటి పథకాలు అమలు కావడంలేదని, మోస పూరిత వాగ్దానాలు ఇచ్చే కాంగ్రెస్ నాయకుల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ను మరోసారి సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నారాయణ గూడలోని భూలక్ష్మి ఆలయంలో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం చేశారు.