షాబాద్ : రంగారెడ్డిజిల్లా రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి పర్యటించి రూ. 371కోట్ల 9లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కోటి రూపాయలు నిధులు వస్తే అదే ఒక పండుగ మాదిరిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఈ రోజు ఒక్క రోజే మహేశ్వరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరానికి రూ. 207కోట్లు, గతేడాది ఆకాల వర్షాలు, వరదలతో కాలనీలన్ని నీటమునిగిన పరిస్థితి మళ్లీ రావద్దని, వరదనీటి కాల్వలను బాగు చేసేందుకు రూ. 92.89కోట్లు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. రోడ్లు బాగుంటేనే ప్రజల సౌకర్యం బాగుంటుందని, రూ. 58.20కోట్లతో రోడ్డు పనులు ప్రారంభించమన్నారు.
ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రజల కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాల నిర్మాణం కోసం రూ. 13కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఒకే రోజు మొత్తం 371 కోట్లతో మహేశ్వరంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ అవసముంటే అక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని రాబోవు వారం రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా రూ. 280 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
మంత్రి సబితారెడ్డి నాయకత్వంలో తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆగ్రభగనా నిలబెడుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం రూ. 371కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి సమస్య పరిష్కరానికి రూ. 1200కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆకాల వర్షాలతో కాలనీల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించేవారన్నారు.
చెరువులకు నీళ్లు వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రావొద్దని, రూ. 100కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాతో పాటు, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ…అభివృద్ధియే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
మున్సిపాలిటీల అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, ఎగ్గే మల్లేశం, జలమండలి ఎండి దానకిశోర్, మున్సిపల్ సీడీఎంఏ సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పార్టీ యువనేతలు కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, గాయకుడు సాయిచందు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు పారిజాత నర్సింహారెడ్డి, దుర్గా దీప్లాల్హన్, డీప్యూటి మేయర్లు తీగల విక్రమ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు అబ్దుల్లాసాధి, మధుమోహన్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, కామేశ్రెడ్డి, ఖలీపా, లక్ష్మయ్య పాల్గొన్నారు.