లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల తొలి రెండు విడుతల్లో సెంచరీ కొట్టామని, మలి రెండు విడుతల్లో మరో సెంచరీ కొడతామని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జశ్వంత్నగర్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఓ జాతీయ చానెల్తో మాట్లాడారు. మూడోదఫా ఎన్నికలు బుందేల్ఖండ్ ప్రాంతంలో జరిగాయని, ఈ ప్రాంతంలో అధికంగా నిరుద్యోగ ఓటర్లు ఉన్నారని, లాక్డౌన్ వల్ల ఇబ్బందిపడ్డ వలసకూలీలు ఉన్నారని.. వారు తమవైపే మొగ్గుచూపారని ఆశాభావం వ్యక్తం చేశారు.