కనగల్, మార్చి 5 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్వన్ నిలుస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ఇరుగంటిపల్లి, జంగమయ్యగూడెం, తంగెళ్లవారిగూడెం, చిన్నమాదారం, చెట్లచెన్నారం, బాబాసాహెబ్గూడెం, శేరిలింగోటం, తేలకంటిగూడెం, తిమ్మాన్నగూడెం, అమ్మగూడెం, ఎం. గౌరారం, తుర్కపల్లి, లచ్చుగూడెం, కనగల్, పర్వతగిరి, చర్లగౌరారం గ్రామాల్లో రూ.3.40 కోట్లతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎం.గౌరారంలో గ్రామపంచాయతీ భవనం, తేలకంటిగూడెంలో పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్రావు, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎర్రబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్రెడ్డి, గోన రవీందర్రావు, శంకర్రావు, సర్పంచులు రాజేశ్వరీయాదయ్య, సతీశ్, నరేందర్రెడ్డి, గంగమ్మాచంద్రయ్య, రమణారెడ్డి, క్రాంతీ శ్రీనివాస్, రాంబాబు, రమేశ్, కోటేశ్, సులక్షణాశేఖర్రావు, లింగయ్య, కళావతీభాస్కర్రెడ్డి, సునీతాకృష్ణయ్యగౌడ్, అంజమ్మారాంచంద్రు, యాదగిరి ఎంపీటీసీలు మల్లికంటి రాజు, నామ కౌసల్యానగేశ్, పాలకూరి సైదులు, నకిరేకంటి శైలజాసైదులు, నల్లబోతు యాదగిరి, బోయ జానయ్య గౌడ్ అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : పట్టణంలోని 8 వార్డులో లెజెండ్స్ యూత్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పిల్లి రామరాజు, మారగోని భవానీగణేశ్, ప్రదీప్ నాయక్, స్వామి, ఉపేందర్, శంకర్ గౌడ్, నరేశ్ గౌడ్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.