హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని.. రాష్ట్రంలోని మహిళలంతా ఆయనకు రుణపడి ఉంటారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. మహిళా భద్రతలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని, షీ టీమ్స్తో మహిళల్లో భరోసా పెరిగిందన్నారు. మహిళ గర్భందాల్చిన నాటి నుంచి బిడ్డ పుట్టే వరకు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ అమ్మ ఒడి వాహనాలను, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమల్లోకి తెచ్చారని కొనియాడారు.