ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రైలు కిందపడి, బైక్ అదుపుతప్పి, మనస్తాపంతో ఉరేసుకుని మృతి చెందారు. ఆయా ఘటనల్లో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీపై నుంచి పడి వ్యక్తి..
సంగెం, మార్చి 30 : స్కూటీ నడుపుతూ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయపర్తి మం డల కేంద్రానికి చెందిన అనపురం సదాశివుడు (65) మంగళవారం సంగెం మండలంలోని తీగరాజుపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చా డు. తీగరాజుపల్లి కెనాల్ రోడ్డుపై నుంచి తిరిగి రాయపర్తికి వెళ్తున్న క్రమంలో లోహిత గ్రామ శివారులో స్కూటీ అదుపు తప్పి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
వరికోల్లో ఒకరు..
నడికూడ : మనస్తాపంతోవ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. మృతుడి కుమారుడు శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒగ్గు కళాకారుడైన దోమల తిరుపతి(56)కి ఇద్దరు భార్యలు భాగ్యమ్మ, మల్లమ్మ ఉన్నారు. మొదటి భార్యకు కుమారుడు, కూతురు, రెండో భార్యకు ఇద్దరు ఉన్నారు. ఇటీవల వ్యవసాయ భూమి అమ్మడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నా యి. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెదాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పరకాల సీఐ మహేందర్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని..
ఖిలావరంగల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘట న సోమవారం అర్ధరాత్రి వరంగల్ రైల్వేగేటు సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సీహెచ్ పరశురాములు తెలిపిన వివరాల ప్రకారం. సుమారు 35 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని యువకుడు వరంగల్ రైల్వేగేటు సమీపంలో పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో లింక్ ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చి ఢీకొనగా లోకో పైలట్ పోచయ్య గుర్తించి డిప్యూటీ ఎస్ఎస్ బీ రవీందర్కు సమాచారం ఇచ్చాడు. ఆయన రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలానికి వెళ్ల గా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం దవాఖానకు తరలించారు. మృతుడి వివరాల కోసం ఎంజీఎం మార్చురీలో లేదా వరంగల్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు.
నెక్కొండ రైల్వే స్టేషన్లో…
నెక్కొండ, మార్చి 30 : రైలు కిందపడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నెక్కొండ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రాపురం గ్రామానికి చెందిన రెడ్డి చిన్నప్పలనాయుడు(46) రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్పీ ఎస్సై పరశురాములు తెలిపారు. లుంగీ, నీలిరంగు చొక్కా ధరించిన వ్యక్తి జేబులో దొరికిన ఆధార్కార్డు ఆదారంగా వివరాలు సేకరించినట్లు చెప్పారు. శవాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీలో భద్రపరచనున్నట్లు ఆయన తెలిపారు.
సింగరేణి క్వార్టర్స్లో మహిళ..
గణపురం : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సింగరేణి క్వార్టర్స్లో మంగళవారం జరిగింది. ఎస్సై రాజన్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి సింగరేణి కేటీకే 5 ఇైంక్లెన్లో ఫిట్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సంతోష్ భార్య శైలజ(24)తో కలిసి సింగరేణి క్వార్టర్స్లో ఉంటున్నాడు. కుటుంబ కలహాల తో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలికి మూడేళ్ల కూతురు సాత్విక (3) ఉన్నది. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించారు. కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సింగరేణి ఏరి యా దవాఖానకు తరలించారు.
జయపురంలో వ్యక్తి…
నర్సింహులపేట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం జయపురంలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జయపురం గ్రామానికి చెందిన గంగాధరి పిచ్చయ్య (55) తాగుడుకు బానిసై రోజూ భార్య సుగుణమ్మను కొట్టేవాడు. ఇదే క్రమంలో ఈనెల 10వ తేదీన కూలీ పనులకు వెళ్లి వచ్చిన భార్యను కొడుతుండగా ఇంట్లో ఉన్న కర్రతో భర్త తలపై గట్టిగా కొట్టింది. తీవ్రంగా గాయపడడంతో జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చింది. చికిత్స పొందుతున్న పిచ్చయ్య మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతుడి సోదరి గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తొర్రూరు సీఐ కర్ణాకర్ మృతదేహాన్ని పరిశీలించారు.
తెట్టెకుంట తండాలో యువతి …
రాయపర్తి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన ఘటన మండలంలోని తిర్మలాయపల్లి గ్రామ శివారు తెట్టెకుంట తండాలో జరిగింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తెట్టెకుంటతండాకు చెందిన బానోత్ సునీత(19)పై వర్ధన్నపేట పరిధి డీసీ తండాకు చెందిన మాలోత్ రాజేందర్ చేయి చేసుకున్నాడు. దీంతో, జీవితంపై విరక్తి చెందిన సునీత ఈనెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.