జనగామ చౌరస్తా: కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్షిప్లో వరంగల్(మహిళల), నల్లగొండ(పురుషుల) జట్లు విజేతలుగా నిలిచాయి. బతుకమ్మకుంట వేదికగా గురువారం జరిగిన మహిళల ఫైనల్లో వరంగల్(డీసీసీ జనగామ) జట్టు 35-30 తేడాతో హైదరాబాద్పై ఉత్కంఠ విజయం సాధించింది. మరోవైపు పురుషుల తుదిపోరులో నల్లగొండ 40-30 తేడాతో వరంగల్పై విజయాన్నందుకుంది. టోర్నీలో విజేతలుగా నిలిచిన వరంగల్, నల్లగొండ జట్లకు చెరో రూ.60 వేలు, ద్వితీయ స్థానాల్లో ఉన్న టీమ్లకు రూ.40 వేలు అందించారు. పోటీల ముగింపు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, వరంగల్ సీపీ తరుణ్ జోషి విజేతలకు ట్రోఫీలు బహుకరించారు.