నర్సంపేట, మార్చి 28 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. సోమవారం నర్సంపేటలో సార్వత్రిక సమ్మె భాగంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఏఐఎఫ్టీ యూ, ఏఐయూటీసీ, కార్మిక సంఘాల ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరూ ఐక్యంగా పోరాడి కేంద్రం మెడలు వంచాలన్నారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేశాఖల ప్రైవేటీకరణతో వేల మం ది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందన్నారు.
చెక్కుల పంపిణీ..
రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది అన్నా రు. క్యాంపు కార్యాలయంలో 31 మంది రైతు కుటుంబాలకు రూ.1.55 కోట్ల విలువైన రైతుబీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు మృతిచెందితే అతడి కుటుంబం గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో రూ.5లక్షల ప్రమాద బీమాను యావత్ ప్రపంచం మెచ్చే విధంగా అందిస్తున్నారన్నారు. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిందని తెలిపారు. నియోజకవర్గంలో 50 ఏళ్లుగా కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో రైతుబీమా కింద రూ.35.75 కోట్లను 715 మంది రైతు కుటుంబాలకు అందించామని వివరించారు. ము న్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట పట్టణంలో ఫర్టిలైజర్ షాపును నిర్వహిస్తున్న నాగబోయిన రవీందర్ మృ తి చెందగా, అతడి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. ఆయన వెంట వ్యవసాయశాఖ ఏడీఏ శ్రీనివాసరావు ఉన్నారు.
ఆలయ అభివృద్ధికి రూ. 5 లక్షలు..
చెన్నారావుపేట : లింగాపురం గ్రామంలో రేణుకాఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన చేసుకోవడం సంతోషకరమని, యాదవ కులంలోని నిరుపేదలకు తనవంతు సహాయం అందిస్తానని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. లింగాపురంలో రేణుకాఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆలయ అభివృద్ధి కోసం సీడీఎఫ్ నిధుల నుంచి రూ.5లక్షలు కేటాయించానన్నారు. మహేశ్వరం వయా గురిజాల క్రాస్ నుంచి లింగాపురం మీదుగా కోనాపురం గ్రామం వరకు బీటీ డబుల్ రోడ్డు, లింగాపురం నుంచి గోబ్రియాతండా వరకు రోడ్డు ను కూడా ఇటీవల మంజూరు చేశామన్నారు. అలా గే, మండలంలోని అమృతండా సర్పంచ్ బోడ శాం తి-ఈర్యానాయక్ దంపతుల కుమార్తె సరస్వతి-సంతోష్నాయక్ వివాహానికి ఎమ్మెల్యే హాజరై నూత న దంపతులను ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, సర్పంచ్లు లక్ష్మీవెంకటేశ్వర్లు, అంగోత్ అరుణావీరాసింగ్, తప్పెట రమేశ్, ఎంపీటీసీ పసునూటి రమేశ్, పాపయ్యపేట గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు బోడ వెంకన్ననాయక్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గామాత చల్లగా చూడాలి..
నల్లబెల్లి : ప్రజలందరిని దుర్గామాత చల్లగా చూ డాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అ న్నారు. మండలంలోని మూడుచెక్కలపల్లె గ్రామం లో నిర్మించిన దుర్గామాత ఆలయాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. ఆలయ ప్రహరీ నిర్మాణానికి రూ.4లక్షల ని ధులు మంజూరు చేశానన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, సర్పంచ్లు బానోత్ పూల్సింగ్, కరివేదుల వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు దే వూనాయక్, పాలెపు రవీందర్రావు, నాయకులు గందె శ్రీనివాస్గుప్తా, మామిండ్ల మోహన్రెడ్డి, నర్సింహాచారి, అశోక్రెడ్డి పాల్గొన్నారు.