ఖిలావరంగల్, మార్చి 28 : కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పోరేట్ శక్తులకు అండగా నిలుస్తోందని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, ఐఫ్టూ జిల్లా నాయకులు బండి కోటేశ్వర్రావు, ఐద్వా నాయకురాలు నలిగంటి రత్నమా ల పేర్కొన్నారు. సార్వత్రిక సమ్మె మొ దటి రోజు సోమవారం ఖిలావరంగల్ పెట్రోల్ పంపు జంక్షన్లో రాస్తారోకో, ధ ర్నా చేశారు. అనంతరం కేంద్ర ప్రభు త్వ దిష్టిబొమ్మను ఆల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో దహనం చేశారు. నాయకులు కుమారస్వామి, భిక్షపతి, అనిల్, కృష్ణ, హరినాథ్, స్వామి పాల్గొన్నారు.
కేంద్రం విధానాలపై దేశవ్యాప్త సమ్మె..
కరీమాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు అన్ని వర్గా లు మద్దతు తెలుపారని ఏఐటీయూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేశ్ అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం రంగశాయిపేట జంక్షన్లో రాస్తారోకో చేపట్టారు. ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆల్ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కరీమాబాద్లోని ప్రదాన రహదారిపై రాస్తారోకో చేసి, అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రామస్వామి, ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
కేంద్రం తీరును ఎండగట్టిన ప్రజా, యూనియన్, సంఘాలు ..
వరంగల్ చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం అనుపరిస్తున్న, అమ లు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, చర్యలకు వ్యతిరేఖంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలోని వరంగల్ చౌరస్తా, ప్రధా న తపాల కార్యాలయం, తెలంగాణ జంక్షన్లో టీఆర్ఎస్కేవీ, కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, టీఏడీయూ, ఎంటీఏడియూ, గ్రామీన తపాల ఉద్యోగులు సంఘాల జిల్లా కమిటీల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం, సీఐటీయూ ఆధ్వర్యం లో ధర్నా చేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్ ప్రధా న తపాల కార్యాలయం ముందు గ్రామీ ణ తపాల ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో పలువురు నాయకులు ధర్నా నిర్వహిస్తూ సార్వత్రిక సమ్మె కు మద్దతు తెలియజేశారు. ప్రజా సంఘాల నాయకులు, అసోసియేషన్, యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాడుదాం
దుగ్గొండి: కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాడాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి మోడెం శ్రీలత పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం గా కార్మిక సంఘాలు రాస్తారోకో చేసి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాధాలు చేశారు. రాస్తారోకోలో ఏఐఎప్టీ యూ న్యూ, సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నా రు. కార్మిక సంఘాల నాయకులు ఈసంపల్లి బాబు, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, గాదం రవి, పిల్లల చిరంజీవి, నల్లగొండ రాజ్కుమార్, రాజు, రవి, వెంకన్న, శివరాత్రి కుమార్, కుమారస్వామి పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి
నర్సంపేట: ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కృష్ణ అన్నారు. సోమవారం నర్సంపేటలోని వరంగల్ రోడ్డు కూడలిలో సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలంటి రా జేందర్, బరిగెల కుమార్, వీరారెడ్డి, పొన్నం జనార్దన్, ముత్యం పెద్ద మొగిలి, సాంబన్న వెంకన్న, నరసింహారాములు, కొత్తగట్టు రవి, నీలం సమ్మయ్య, డేగల నర్సయ్య, జంపయ్య, ఒంటరి ఎల్లయ్య, సోనబోయిన శివాజీ, ఎం సాంబయ్య, భాస్కర్, వెంకన్న పాల్గొన్నారు.
బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలి
నర్సంపేట: బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు కోరబోయిన కుమారస్వామి కోరారు. సోమవారం నర్సంపేటలో సా ర్వత్రిక సమ్మెలో భాగంగా నిరసన ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హన్మకొండ శ్రీధర్, గుజ్జుల ఉమా, గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ధార గీత, వజ్జంతి విజయ, ఉదయగిరి నాగమణి, జెట్టి స్వర్ణలత, గణిపాక ఇంద్ర, లక్ష్మి, స్వప్న, టీ ప్రవళిక, మొలుగూరి రాజు, కొండి మల్లయ్య, కే అనిల్, వీరన్న, దేవన్న, నర్సింహారాములు, పాలకుర్తి మధు, టీ రజిత పాల్గొన్నారు.
కాశీబుగ్గ జంక్షన్లో
కాశీబుగ్గ: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేఖ విధానాలకు నిరసనగా సోమవారం కాశీబుగ్గ జంక్షన్లో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఇనుముల మల్లేశం, సులుగం వేణుగోపాల్, వైకుంఠం, మల్లాజి, వేణు, బిక్షపతి, సారంగం, సుధీర్, గొంగళ్ల ఐలయ్య, సుంచు కనకయ్య, వీరస్వామి, గజేంద్ర, సుధాకర్, రాజు, సాంబయ్య, బోసు, సీతయ్య, పైడి, శ్రీకాంత్, గంధం భాస్కర్, గొర్రె శేఖర్, ఈటల సుమన్, వాసం సంజీవ, మంద కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
వెంకట్రామ జంక్షన్లో..
నగరంలోని వెంకట్రామ జంక్షన్నలో హమాలీ సంఘం కూరగాయల, పండ్ల మార్కెట్ (టీఆర్ఎస్కేవీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర నాయకుడు మర్రి శ్రీనివాస్, కార్పొరేటర్ సోమిశేట్టి ప్రవీన్, హమాలీ కార్మిక సంఘం నాయకులు పోగులకొండ సారయ్య, వెంకన్న, చీకటి కుమార్, జట్టు రాములు, సజ్జన చంద్రయ్య, పదుల తిరుపతి పాల్గొన్నారు.