నర్సంపేటరూరల్/రాయపర్తి, మార్చి 12: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకుందని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు. ఇటుకాలపల్లి 4వ వార్డులో రూ. 5 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీసీరోడ్ల ఏర్పాటుతో గ్రామాల కళ మారుతున్నదన్నారు. మౌలిక వసతులకు సీఎం పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు, పల్లెలు సంపూర్ణ అభివృద్ధి సాధిస్తున్నాయని కొనియాడారు.
కార్యక్రమంలో సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్ననాయక్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, నాయకులు కోమాండ్ల గోపాల్రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, వార్డు సభ్యులు బూడిద వసంత, రవీందర్ పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మిస్తున్నట్లు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ ఏఈ శేషం కిరణ్కుమార్తో కలిసి పెర్కవేడులోని వార్డులు, వీధులు, పలు కాలనీల్లో చేపట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఎంపీపీ వెంట బాషబోయిన సుధాకర్యాదవ్ ఉన్నారు.