గీసుగొండ/ఖిలావరంగల్/సంగెం, ఫిబ్రవరి 23: పేదల ఆపద్బాంధవుడిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఐదుగురికి బుధవారం ఎమ్మెల్యే హనుమకొండలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, టీఆర్ఎస్ నాయకులు సుంకరి శివ, కోటా ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు రూ. 1.20 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గద్దె బాబు, టీఆర్ఎస్ నాయకులు సోల్తీ నరేందర్ పాల్గొన్నారు. అలాగే, సంగెం మండలంలోని తీగరాజుపల్లికి చెందిన మునుకుంట్ల కుమార్ రూ. 30 వేలు, షాపూర్కు చెందిన మహ్మద్ రజాక్కు రూ. 36 వేలు, సోమ్లాతండాకు చెందిన బానోత్ ఈర్యాకు రూ. 60 వేలు, లోహితకు చెందిన అడ్డగట్ల సుధీర్కు రూ. 38 వేలు, మొండ్రాయికి చెందిన చాపర్తి మల్లయ్యకు రూ. 48 వేల విలువైన చెక్కులను ధర్మారెడ్డి హనుమకొండలోని తన నివాసంలో అందజేశారు. అనంతరం చల్లా ధర్మారెడ్డి సంగెం మండలంలోని గవిచర్ల, రాంచంద్రాపురంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. గవిచర్లకు చెందిన అనుముల కాంతమ్మ, వేలూరి సదాశివరావు, ముడిదేని లక్ష్మీనర్సమ్మ, రాంచంద్రాపురంలో దౌలత్బాజీ వరుణ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట దొనికెల శ్రీనివాస్, పత్తిపాక రమేశ్, దొనికెల మల్లయ్య, కరుణాకర్, బోంపెల్లి దిలీప్రావు, కాలె కిషన్, దోపతి సమ్మయ్యయాదవ్, కత్తి రమేశ్, జక్క మల్లయ్య ఉన్నారు.
గీసుగొండ: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు అన్ని రంగాల్లో పూర్తి రక్షణ కల్పిస్తున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్కాలనీలో బుధవారం రూ. 60 లక్షల నిధులతో చేపట్టిన సఖీ (వన్స్టాప్) భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఖీ జిల్లా కార్యాలయం గీసుగొండకు రావడం ఆనందంగా ఉందన్నారు. భవన నిర్మాణ పనులను అధికారులు దగ్గరుండి చేయించాలన్నారు. సఖీ కేంద్రం వరకు రోడ్డును విస్తరించాలన్నారు. ఇప్పుడున్న 8 గుంటల భూమికి మరో ఐదు గుంటలను సఖీ కేంద్రానికి అప్పగించాలని సూచించారు. సఖీ కేంద్రం పక్కనే రూ. 80 లక్షలతో జిల్లా బాలికల వసతి గృహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ్, జిల్లా శిశు సంక్షేమ అధికారి శారద, సఖీ జిల్లా సెక్టార్ అధికారి శ్రీలత, సీడీపీవో శ్రీలత, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, కార్పొరేటర్లు ఆకుల మనోహర్, సుంకరి మనీషా, డైరెక్టర్ గోలి రాజయ్య, సొసైటీ చైర్మన్ డీ రమేశ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు సుంకరి శివ, వేణు పాల్గొన్నారు.