నర్సంపేటరూరల్/నల్లబెల్లి, నవంబర్ 30: అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ వాసం రామ్మూర్తి పిలుపునిచ్చారు. నర్సంపేట మండలం ముత్తోజిపేటలో సర్పంచ్ గోలి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన బుధవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మోహన్రెడ్డి, ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్, ఉప సర్పంచ్ పెదరాయుడు, ఆర్ఐ రజాక్, కార్యదర్శి యుగేంధర్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేటలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భం గా తహసీల్దార్ దూలం మంజుల మాట్లాడుతూ దళితుల హక్కులకు ఎవరైనా భంగం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవో విజయ్కుమార్, ఆర్ఐ రాజేంద్రప్రసాద్, ఏవో పరమేశ్వర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రవి, కార్యదర్శి శ్రీనివాస్, ఏఈవో భాస్కర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పౌరహక్కులపై అవగాహన పెంచుకోవాలి
వర్ధన్నపేట/చెన్నారావుపేట/రాయపర్తి: రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తహసీల్దార్ రవిచంద్రారెడ్డి అన్నారు. వర్ధన్నపేట మండలంలోని రాంధాన్తండాలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, తహసీల్దార్ హాజరై తండావాసులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగం తమకు నచ్చిన వారిని ఎన్నుకునే అవకాశాన్ని ఓటుహక్కు ద్వారా కల్పించిందని తహసీల్దార్ అన్నారు. అంతేకాకుండా పౌరులకు అనేక రకాల హక్కులు కల్పించిందని తహసీల్దార్ వివరించారు. సదస్సులో సర్పంచ్ గుగులోత్ లక్ష్మి, యువకులు, స్థానికులు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం లింగాపురంలో సర్పంచ్ తప్పెట రమేశ్ అధ్యక్షతన పౌర హక్కులపై డీటీ మధుసూదన్ అవగాహన కల్పించారు. ఎంపీటీసీ రమేశ్, హెచ్ఎం మోహన్రావు, కార్యదర్శి శ్వేత పాల్గొన్నారు. అలాగే, రాయపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఓటర్ ప్రత్యేక నమోదు కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్ధార్ కుసుమ సత్యనారాయణ మాట్లాడుతూ యువత ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని బంధన్పల్లిలో సివిల్ రైట్స్ డే నిర్వహించారు. సర్పంచ్ దీప్లానాయక్, ఉప సర్పంచ్ నాగేశ్వర్రావు, ఎంపీటీసీ రాధమ్మ, ఏఎన్ఎం జ్యోతి పాల్గొన్నారు.