నల్లబెల్లి, నవంబర్ 26: రైతులు పండించిన చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు. మండలంలోని రాంపూర్, మామిండ్లవీరయ్యపల్లెలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ధాన్యాన్ని కల్లాల వద్దే ఆరబెట్టి మట్టి, దుమ్ము లేని నాణ్యమైన వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు పొందాలని రైతులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, సర్పంచ్లు చింతపట్ల సురేశ్రావు, ఊరటి అమరేందర్రెడ్డి, ఏపీఎం సునీత, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, పీఏసీఎస్ వైస్చైర్మన్ మోహన్రావు, నాయకులు గందె శ్రీనివాస్గుప్తా, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి, మామిండ్ల మోహన్రెడ్డి, సాంబరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు నిబంధనలు పాటించాలి
రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని జడ్పీటీసీ కోమాండ్ల జయ కోరారు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో దాసరిపల్లి, కమ్మపల్లి సర్పంచ్లు శ్రీనివాస్, వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, ఉప సర్పంచ్ తిరుపతి, ఏఈవోలు భరత్, నవీన్, వైస్ చైర్మన్ మేర్గు శ్రీనివాస్, కోమాండ్ల గోపాల్రెడ్డి, డైరెక్టర్లు దామెర రవీందర్, గుగులోత్ లక్ష్మణ్, బైరి జనార్దన్రెడ్డి, పెసరు సాంబరాజ్యం, మిట్టగడపల సుప్రజ, కోమాండ్ల రాజిరెడ్డి, సీఈవో జక్కుల మధు పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని ముద్దునూరు, బల్వంతాపురంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్కమార్, ఏవో దయాకర్, సర్పంచ్లు రేవూరి సురేందర్రెడ్డి, శంకేసి శోభా కమలాకర్, ఎంపీటీసీ కొంగర అరుణ-రవి, చింత లావణ్య-యుగేంధర్, మోర్తాల రాజు, ఏఈవోలు హన్మంతు, రాజేశ్, మధు పాల్గొన్నారు. అలాగే, నెక్కొండ మండలంలోని నెక్కొండ, పెద్దకోర్పోలు, చిన్నకోర్పోలు, నాగారం, వాగ్యానాయక్తండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, సీనియర్ నాయకుడు చల్లా చెన్నకేశవరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, సీఈవో మోడెం సురేశ్, ఉప సర్పంచ్ వీరభద్రం, సొసైటీ వైస్ ఛైర్మన్ మెండె వెంకన్న, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, నాయకులు, పెద్దకోర్పోలు సర్పంచ్ మహ్మద్పాషా, ఎంపీటీసీ కర్ర సుకన్య, సొసైటీ డైరెక్టర్లు పొరండ్ల రాంచందచర్, తేజావత్ గోపి పాల్గొన్నారు.