చిట్యాల, డిసెంబర్ 1: రైతులు దళారులను నమ్మి మోస పోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్రెడ్డి ఆధ్యర్యంలో జడల్పేట, ఒడితలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కోఆర్టినేటర్ నల్ల సమ్మిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, పార్టీ బీసీసెల్ మండలాధ్యక్షుడు కిష్టయ్య, సర్పంచులు రత్నాకర్రెడ్డి, సాంబలక్ష్మి, శంకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
మొగుళ్లపల్లి: పర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ జోరుక సదయ్య ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు ఆధ్వర్యంలో చేపట్టిన కొనగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కట్ట విజేందర్, పీఏసీఎస్ డైరెక్టర్ మెట్టు వెంకటస్వామి, ఏఈవో భిక్షపతి పాల్గొన్నారు.
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
గణపురం: చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. కర్కపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐలయ్య, సీఈవో గోవర్ధన్రెడ్డి, స్థానిక సర్పంచ్ నగేశ్, ఎంపీటీసీ మారగాని సరస్వతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేశ్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ రమేశ్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.
తేమలేని ధాన్యం తీసుకురావాలి
రేగొండ: రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి నిబంధనల మేరకు తేమ లేకుండా చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఎంపీపీ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ధాన్యం కొనుగోళ్లపై ప్రజాప్రతినిధులు, నిర్వాహకులకు రేగొండ మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్వవసాయ అధికారి వాస్దేవారెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మటిక సంతోష్, అంకం రాజేందర్, ఏఈవోలు ప్రశాంత్ , సునిల్, గోవర్ధన్ ఉన్నారు.