హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ పాకులాడుతూ దొంగ నాటకాలకు తెరతీస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని స్వగృహంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఉత్తరం తెస్తే తాను రాజీనామా చేస్తానని.. లేకుంటే ఎంపీ పదవికి బండి సంజయ్, మంత్రి పదవికి కిషన్రెడ్డి రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరితే రైతు దీక్ష విరమించి తోకముడిచారని ఎద్దేవా చేశారు. ఓ వైపు రైతులను దగా చేస్తూనే మరోవైపు రైతు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. నాలుగు నెలలుగా ధాన్యం కొనాలని చెబుతున్నా మోడీ సర్కారు నుంచి స్పందన లేదని దుయ్యబట్టారు.
వనపర్తి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు చేస్తామని సాయంత్రం 5 గంటల వరకు కేం ద్రం నుంచి బీజేపీ నాయకులు ఉత్తరం తెస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే ఎంపీ పదవికి బండి సంజ య్, మంత్రి పదవికి కిషన్రెడ్డి రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరితే రైతు దీక్ష విరమించి ఎంపీ బండి సంజయ్ తోకముడిచాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే దీక్ష పేరిట బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు. ఇటువంటి దీక్షలు పనిచేయవని, హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం వనపర్తిలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉదయం విసిరిన సవా ల్ స్వీకరించకుండా మధ్యాహ్నం 2 గంటలకే బీజేపీ నేతలు దీక్షాశిబిరం నుంచి పారిపోయారని విమర్శించారు. ఇటువంటి నేతలు రాష్ట్రమంతా దీక్షలు చేస్తారా? అని ప్రశ్నించారు. రైతులపై నల్ల చట్టాలను ప్రయోగించి, రైతుల చావులకు కారణమైన బీజీపీ రైతులకు మేలు చేస్తామని చెప్పడం దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై బీజీపే ఎంపీ వరుణ్గాంధీ సొంత పార్టీని విమర్శించిన సంగతి గుర్తు చేశారు.
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉత్తరప్రదేశ్ రైతులపై బీజేపీ మంత్రి కొడుకు వాహనంతో తొక్కించాడని చెప్పారు. 2022 వరకు రైతుల ఆదా యం రెట్టింపు చేస్తామని పీఎం నరేంద్రమోడీ అన్నారని, రైతులకు ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ చేసిన దొంగ దీక్షతో రైతులపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయిందన్నారు. నాలుగు నెలల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నా కేంద్రంలో చలనం లేదని ధ్వజమెత్తారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నందుకు దీక్షలు చేస్తారా..? అంటూ చురకలు అంటించారు. గుజరాత్లో కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదన్నారు. దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం తెలంగాణకు రాసిన లేఖను చూపించినా బండి సంజయ్ మళ్లీ అడగడం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు.
ఇంగ్లిష్ రాకుంటే ఆ బాష వచ్చిన వారితో చదివించుకోవాలని మంత్రి సూచించారు. పంజాబ్లో సేకరించిన విధంగా తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం ఎందుకు సేకరించదని ప్రశ్నించారు. అక్కడ ఎంత కష్టం ఉందో తెలంగాణ రైతులు కూడా అంతే కష్టపడి అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్నారన్నారు. సమావేశంలో వనపర్తి జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గట్టు యాద వ్, శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, గొర్రెల కాపరుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.