కేంద్ర మంత్రి నిర్మలకు వినతి
హైదరాబాద్, జనవరి 1 : చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ చాంబర్స్, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధు లు విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిల్లుల్లో, చేనేత మగ్గంపై తయారైన వస్ర్తాలపై ఒకేవిధంగా పన్ను విధించడం సరికాదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 32 లక్షల చేనేత కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ చాంబర్స్ అధ్యక్షుడు పద్మశ్రీ గజం అంజయ్య, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్ననేత, జాతీయ అవార్డు గ్రహీత కందగట్ల బాలమ ణి, ప్రవీణ్భాయ్, గోవింద్ గణప, కందగట్ల నర్సిం హ, చిలువేరు కాశీనాథ్ తదితరులు ఉన్నారు.