వీణవంక రూరల్ : విద్యావంతుడు, ఉద్యమకారుడు, కేసీఆర్ ఆశీర్వదించి పంపిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఆదరించి గెలిపించాలని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ప్రజలను కోరారు. వీణవంక మండలంలోని చల్లూరు, నర్సాపూర్ గ్రామాల్లో బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక పథకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు.
మైనార్టీల కోసం షాదీ ముబారక్, పేద పిల్లల కోసం ప్రత్యేక మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ సర్కారుకు అండగా నిలువాలని కోరారు. ఈ నెల 30న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.