న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారతీ ఎయిర్టెల్.. ఇండస్ టవర్స్లో వొడాఫోన్కున్న వాటాల్లో 4.7 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ఇరు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది. ఈ నిధులతో వొడాఫోన్ ఐడియా, మొబైల్ టవర్ కంపెనీకి ఉన్న బకాయిల్లో కొంతమేర చెల్లించడానికి వినియోగించనున్నది. దీంతో రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియాకు ఊరట లభించినైట్టెంది. కాగా, సునీల్ మిట్టల్ నాయకత్వంలోని ఎయిర్టెల్ చౌక ఈ వాటాను కొనుగోలు చేసింది.