బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో లోబో ప్రవర్తన ఒక్కోసారి చిరాకు పెట్టిస్తుంది.కాజల్ మాటలకు అతను మిడిల్ ఫింగర్ చూపించడంతో ఆ ఇష్యూ చాలా పెద్దదిగా మారింది. లోబో తీరుని కొందరు ఇంటి సభ్యులు తప్పు పట్టడంతో చివరికి సారీ చెప్పాడు. అయితే నేను కిచెన్లో ఏమీ చేయలేదని స్టేట్ మెంట్ ఇచ్చావ్ అది రాంగ్గా వెళుతుందని కాజల్పై తెగ ఆగ్రహం వ్యక్తం చేశాడు రవి.
‘నేను నెల నుంచి కిచెన్లో వర్క్ చేయలేదు.. ఓన్లీ వాష్ రూం మాత్రమే చేశానని స్టేట్ మెంట్ ఇచ్చావా? లేదా? అని కాజల్ని అంటే.. ‘కిచెన్ డ్యూటీ రాలేదని అన్నాను’ అంటూ మాట మార్చేసింది కాజల్. లోబో నాకు మిడిల్ ఫింగర్ చూపించాడు.. మరి దానికేం చేస్తావ్ సపోర్ట్ చేస్తున్నావ్ ఎందుకు అని కాజల్ అనడంతో.. ‘అది తప్పు అని నేను వాడికి చెప్పా.. వాడు యాక్షన్ తప్పు అని అక్కడే చెప్పా’ అని అన్నాడు రవి. శ్రీరామ్ గొడవను సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటే.. లోపల జెస్సీ-షణ్ముఖ్లు నవ్వుకుంటూ కనిపించారు.
బిగ్బాస్.. ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ను ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్లో భాగంగా ఇద్దరు రాజులు రవి, సన్నీ సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడతారు. మిగతా ఇంటి సభ్యులు ప్రజలుగా వ్యవహరిస్తారు అని తెలిపాడు. టాస్క్ పూర్తయ్యే సమయానికి ఏ రాకుమారుడికి ఎక్కువ మద్దతు లభిస్తే వాళ్లు సింహాసనాన్ని అధిష్టిస్తారు. అందరి కంటే ఎక్కువ ధనం ఉన్న రాజు, అతడి ప్రజలు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని అందుకుంటారు.
రవి, సన్నీ హౌజ్మేట్స్ సపోర్ట్ కోసం ప్రయత్నించగా, యాంకర్ రవికి విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ మాస్టర్ సపోర్ట్ చేయగా.. సన్నీకి మానస్, లోబో, ప్రియాంక సింగ్, ప్రియ, సిరి, షణ్ముఖ్, జెస్సీ మద్దతుగా నిలబడ్డారు. కొద్ది సేపటి తర్వాత సిరి..రవి టీంలోకి వచ్చేసింది. అయితే ఖజానాలో నుంచి నాణాలు పోయాయని గుర్తించిన విశ్వ.. ఇవన్నీ చేతగానోళ్లు చేసే పనులంటూ మండిపడ్డాడు.
ఇక బిగ్బాస్ ప్రవేశపెట్టిన ‘మట్టిలో మహాయుద్ధం’ అనే కుస్తీపోటీలో రవి వైపు నుంచి నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్; సన్నీ వైపు నుంచి మానస్, జెస్సీ, పింకీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏ రాజు గెలిస్తే అతడికి 150 నాణాలు లభిస్తాయి. ఇందులో విజేత ఎవరన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది.