అమరావతి : అమెరికాలోని అలబామా రాష్ట్రంలో దుండగులు జరిపిన కాల్పుల్లో విశాఖపట్నంకు చెందిన యువకుడు మృతి చెందాడు. నెల రోజుల క్రితమే ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్లిన చిట్లూరి సత్యకృష్ణ(27) పాత బర్మింగ్హాంలో స్టోర్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో సత్యకృష్ణ మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఈ సందర్భంగా నిందితుల ఫొటోలను అమెరికా పోలీసులు విడుదల చేశారు. తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సీఎం జగన్ చొరవ తీసుకుని మృతదేహాన్ని అమెరికా నుంచి స్వస్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.