జొహన్నెస్బర్గ్: క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత దృఢంగా ఉంటాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టుకు ముందు ఆదివారం ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా సిరీస్లో మన జట్టు ఆధిక్యంలో ఉన్నా.. ఆట కన్నా ఇతర అంశాల గురించే ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఇలాంటి సమయాల్లోనూ కోహ్లీ మనోైస్థెర్యం కోల్పోకుండా జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపుతున్నాడు. కోహ్లీ తోటి ఆటగాళ్లతో కలిసిపోయే తీరు చూడముచ్చటగా ఉంటుంది. వ్యక్తిగతంగా అతడి ప్రాక్టీస్ బాగుంటుంది. త్వరలోనే విరాట్ భారీ స్కోరు చేస్తాడు. ఈ మ్యాచ్లోనే అది సాధ్యపడాలని అనుకుంటున్నా’ అని అన్నాడు. సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానేను ద్రవిడ్ వెనకేసుకొచ్చాడు.