ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి అవసరమని మాజీ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ ‘‘ఓవర్ కుక్డ్’’ (అంటే మరీ ఎక్కువ వండేసిన పదార్థం) అని కొంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నాడు. ఇంగ్లండ్ మాజీ సారధి మైకేల్ వాగన్ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
సన్రైజర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. ఈ ఐపీఎల్లో తొలి బంతికే అవుటవడం కోహ్లీకి ఇది మూడోసారి. దీనిపై స్పందించిన వాగన్.. ప్రస్తుత క్రికెటర్లు ఆడే క్రికెట్ చాలా ఎక్కువని, ఇలాంటి సమయాల్లో విశ్రాంతి కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ‘‘ఒక్కోసారి ఒక్కో ఆటగాడికి ఆట నుంచి విశ్రాంతి ఒక్కటే సరిపోతుంది. ఈ ప్లేయర్స్ ఇంతగా క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్రేక్ తీసుకోవడం కూడా ముఖ్యమే’’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్లో కోహ్లీ పేరు ప్రస్తావించకపోయినా చాలా మంది మాజీలు అతనికి ఇదే సలహా ఇస్తుండటం గమనార్హం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లీ.. 12 మ్యాచుల్లో కేవలం 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ కెరీర్ మొత్తమ్మీద కోహ్లీ ఆరుసార్లు డకౌట్ అవగా.. వాటిలో మూడు సార్లు ఇదే సీజన్లో అవడం గమనార్హం.
Sometimes a break from the game is all a player needs .. the amount of cricket these players play a break is as good as anything .. #IPL2022
— Michael Vaughan (@MichaelVaughan) May 8, 2022