హైదరాబాద్: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి నేటితో 14 ఏళ్లు నిండాయి. 2011 ఆగస్టు 18వ తేదీన డంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో అతను అరంగేట్రం చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను 22 బంతుల్లో 12 రన్స్ మాత్రమే చేశాడు. కానీ 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో కోహ్లీ ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియన్ క్రికెట్లోనూ అత్యుత్తమ క్రికెటర్గా అవతరించాడు. 14 ఏళ్ల అనుభవాల్ని కోహ్లీ తన ఇన్స్టాలో పంచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలతో వీడియోను పోస్టు చేశాడు. 14 ఏళ్ల క్రితం కెరీర్ మొదలైందని, దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కోహ్లీ తన వీడియో క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ సందర్భంగా కెరీర్లో ఎదురైన అనుభవాలను అభిమానులతో కోహ్లీ షేర్ చేశాడు. నన్ను ఆదరించే, ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్నా ఒంటరిగా ఫీలైన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నాడు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అన్నాడు. ఇది చాలా కఠినమైన సమస్య అని, అన్ని సమయాల్లో బలంగా ఉండటానికి మనం ప్రయత్నించినప్పుడు అది బాధిస్తుందని చెప్పాడు. అథ్లెట్లు రెస్ట్ తీసుకోవడం.. ఒత్తిడి నుంచి కోలుకొని, తిరిగి పుంజుకోవడం చాలా ముఖ్యం అని కోహ్లీ పేర్కొన్నాడు.