కోల్కతా: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్పై విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో జైస్వాల్(Yashasvi Jaiswal) కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు. పవర్ గేమ్తో బెంబేలెత్తించిన యశస్విని కోహ్లీ మెచ్చుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోహ్లీ రియాక్ట్ అయ్యాడు.మ్యాచ్ను టీవీలో వీక్షించిన కోహ్లీ.. వెంటనే తన ఇన్స్టా స్టోరీ కామెంట్ పోస్టు చేశాడు. ఇటీవల కాలంలో తాను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదేనంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. యశస్వి ట్యాలెంట్ అమోఘమని కోహ్లీ కీర్తించాడు.
క్రికెట్ లెజెండ్స్ కోహ్లీ, ధోనీ, బట్లర్ లాంటివారి నుంచి తాను నేర్చుకుంటున్నట్లు జైస్వాల్ తెలిపాడు. కేకేఆర్తో మ్యాచ్లో జైస్వాల్ 47 బంతుల్లో 98 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఆ మేటి బ్యాటర్లు ఇచ్చే సలహాలు తనకు ఉపయోగపడుతున్నట్లు చెప్పాడు. ఐపీఎల్లో ప్రస్తుతం అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. 12 మ్యాచుల్లో అతను 575 రన్స్ చేశాడు. దాంట్లో ఓ సెంచరీ, 4 ఫిఫ్టీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటర్ డూప్లెసిస్ వద్ద ఉంది.