Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి తెలియని వారు ఉండరు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. టీమిండియా (Team India)లో టాప్ బ్యాటర్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కింగ్ కోహ్లీనే. కేవలం ఆట పరంగానే కాదు సంపాదనలోనూ అతను కింగే. క్రికెట్ ద్వారానే కాకుండా యాడ్స్, ఇతర బిజినెస్ల ద్వారా కోహ్లీ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా కూడా భారీగానే ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. అయితే కోహ్లీపై అప్పుడప్పుడూ ఫేక్ న్యూస్లు వస్తుంటాయి.. ఈ మధ్యే ఇన్స్టాగ్రామ్లో ఒక్కో పోస్ట్కు రూ.11.45 కోట్లు వసూలు చేస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇది చూసిన కోహ్లీ దానిపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా అలాంటి పరిస్థితే కోహ్లీకి మరోకటి ఎదురైంది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు మహారాష్ట్ర అలీబాగ్ (Alibagh)లో ఉన్న వారి ఫామ్హౌస్లో క్రికెట్ మైదానం నిర్మిస్తున్నారు. నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, సువిశాల విస్తీర్ణంలో దీన్ని కట్టనున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు మొదలైనట్లు తెలుస్తోందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ది టైమ్స్ అఫ్ ఇండియా (The Times Of India) రాసింది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తేలింది.
తాజాగా దీనిపై విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందించాడు. చిన్నప్పటి నుంచి నేను చదివే న్యూస్ పేపర్ (TOI) కూడా ఫేక్ న్యూస్ రాయడం స్టార్ట్ చేసిందిగా అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.