Virat Kohli | వెస్టిండీస్ (India Vs West Indies)తో జరగుతున్న టెస్టు సిరీస్లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్ ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ (76).. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో (87) సెంచరీకి చేరువయ్యాడు. ఇక తన కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ (Virat 500th Match) ఆడుతున్న విరాట్ మరో అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు.
రెండో టెస్టులో కనుక కోహ్లీ సెంచరీ చేస్తే 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టిస్తాడు. కాగా ఈ రికార్డు సాధించడానికి కోహ్లీ ఇంకా 13 పరుగులు చేయవలసి ఉంది. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (664), ధోనీ (538), రాహుల్ ద్రావిడ్ (509) వంటి ఆటగాళ్లు 500పైగా మ్యాచులు ఆడిన.. వారెవరూ 500వ మ్యాచ్లో సెంచరీ చేయలేకపోయారు.
మరోవైపు తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టులోనూ గట్టి పునాది వేసుకుంటున్నది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. తన కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీకి (87*) దగ్గరవ్వగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) క్రీజ్(36*) లో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ (Kemar Roach), గాబ్రియల్ (Shannon Gabriel), వారికన్, జేసన్ హోల్డర్ (Jason Holder) తలో వికెట్ తీశారు.