కరోనా వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తిచేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తాజాగా విలేజ్ లెవల్ మల్టీ డిసిప్లినరీ టీంలతో ఓటరు లిస్ట్ ఆధారంగా సర్వే చేపట్టింది. కాగా, వికారాబాద్ జిల్లాలో బుధవారం, గురువారం రెండు రోజులు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించారు. ఇప్పటివరకు ఎంతమంది ఒకటి, రెండు డోసులు తీసుకున్నారు.. అసలు టీకా వేసుకోనివారు ఎంతమంది ఉన్నారనే లెక్కను తేల్చారు. దీని ఆధారంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారు. నవంబర్ 3వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకుసాగుతున్నారు. మరోవైపు ఈ నెల 27వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 4,98,317 డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయగా.. 1,10,000 డోసుల స్టాకు ఉన్నది. ప్రస్తుతం 231 కేంద్రాల ద్వారా టీకా ఇస్తుండగా.. అవసరమైతే మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి తెచ్చి సకాలంలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పరిగి, అక్టోబర్ 28: వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (విలేజ్ లెవల్ మల్టీ డిసిప్లినరీ) గ్రామస్థాయి బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ సర్వే ద్వారా ప్రతి గ్రామంలో ఎంతమంది ఉన్నారు.. వారిలో ఇప్పటివరకు ఎంతమంది మొదటి, రెండో డోసు కొవిడ్ టీకాలు తీసుకున్నారు. ఎం త మంది ఇప్పటివరకు తీసుకోలేదో లెక్క తేల్చి వారికి కూడా కొవిడ్ టీకాలు పంపిణీ చేయను న్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. జిల్లా స్థాయి అధికారు లు ఈ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. నవంబర్ 3వ తేదీ వరకు వికారాబాద్ జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకుని, దానికి అనుగుణంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
4,98,317 డోసులు పూర్తి..
వికారాబాద్ జిల్లాలో ఈనెల 27వ తేదీ వరకు 4,98,317 డోసుల కొవిడ్ టీకాలేశారు. అందు లో 4,13,948 మందికి మొదటి డోసు, 84,369 మందికి రెండో డోసు టీకాలు తీసుకు న్నారు. ఈ లెక్కన ఓటరు జాబితా ప్రకారం మి గతా వారికి కూడా మొదటి, రెండో డోసు కొవిడ్ టీకాలేసేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో గ్రామీ ణ ప్రాంతాల్లో 134 కేంద్రాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 97 కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు మొత్తం 231 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. అవసరమైతే ఈ వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను పెంచేందుకు కూడా వైద్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టనున్నారు.
గ్రామస్థాయి బృందాలతో ఇంటింటి సర్వే..
వికారాబాద్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత కోసం విలేజ్ లెవల్ మల్టీ డిసిప్లినరీ టీం (గ్రామస్థాయి బృం దాలతో)లతో ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ గ్రా మస్థాయి బృందాల్లో 262 మంది ఆరోగ్య కార్యకర్తలు, 713 మంది ఆశ వర్కర్లు, 1069 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 566 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు, 1130 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు, 825 మంది వీఆర్ఏలు జిల్లాలోని 797 హ్యాబిటేషన్లలో సర్వే చేపట్టా రు. ఓటర్ల జాబితా ఆధారంగా ఈ సర్వే జరుగు తున్నది. వికారాబాద్ జిల్లాలో మొత్తం 7,95,547 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 3,98,862మంది పురుషులు, 3,96,667 మంది మహిళలు, 18మంది ఇతరులు ఉన్నా రు. ప్రతి ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉన్నా రు, వారిలో ఎంతమంది మొదటి, రెండో డోసు కొవిడ్ టీకా తీసుకున్నారు. ఎంతమంది అసలు కొవిడ్ టీకాను తీసుకోలేదు. ఎవరైనా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారా, చనిపోయా రా..? తదితర అంశాలను పూర్తిస్థాయిలో తెలు సు కుంటూ సర్వే చేస్తున్నారు. ఈ సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిగి మండలం నస్కల్లో, జిల్లా వైద్యాధికారి తుకారాం వివిధ ప్రాంతాల్లో స్వయంగా గురువారం పరిశీలించారు.
జిల్లాలో 1,10,000 లక్షల డోసుల స్టాకు
వికారాబాద్ జిల్లా పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసేందుకు ఓవైపు సర్వే చేస్తూనే, అవసరం మేరకు కొవిడ్ టీకా స్టాకును తెప్పిస్తు న్నారు. గురువారం వరకు జిల్లాలో కొవిడ్ టీకా ల స్టాకు 1,10,000 లక్షల డోసులు ఉన్నది. అవసరమైతే మళ్లీ ఎప్పటికపుడు కొవిడ్ వ్యా క్సిన్ డోసులు తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు రాలేని వారికి(వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వారు) అవసరమైతే వారి ఇండ్లకే వెళ్లి కొవిడ్ టీకాలు వేసి కొద్దిసేపు వైద్యులు, వైద్య సిబ్బంది అక్కడే ఉండి పర్యవేక్షించి వస్తున్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తే లక్ష్యం..
వికారాబాద్ జిల్లా పరిధిలో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తే లక్ష్యంగా ఇంటింటి సర్వేను చేపట్టడం జరిగింది. ఈ సర్వేలో ఎంతమంది మొదటి, రెండో డోసు కొవిడ్ టీకాలు తీసుకున్నారు. ఎంతమంది అసలు టీకానే తీసుకోలేదు, ఎంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఎంతమంది మృతి చెందారు తదితర వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకుని, టీకాలు తీసుకోని వారికి వారి వారి ఇండ్ల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నాం. నవంబర్ 3వ తేదీ వరకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకు అవసరమైన వ్యాక్సిన్ ఎప్పటికపుడు జిల్లాకు చేరుకుంటుంది.
-తుకారాంభట్, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి
16 పీహెచ్సీల్లో పూర్తయిన ఇంటింటి సర్వే
కొవిడ్ వ్యాక్సినేషన్పై జిల్లాలో గ్రామస్థాయి బృందాలతో చేపట్టిన ఇంటింటి సర్వే16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తయింది. జిల్లాలో 22 పీహెచ్సీలుండగా అందులోని 16 పీహెచ్సీల్లో సర్వే పూర్తి కాగా.. మిగతా పీహెచ్సీల్లో 50 నుంచి 60శాతం వరకు సర్వే జరిగింది. మిగతాది శుక్రవారం మధ్యాహ్నం లోపు పూర్తవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా వుండగా సర్వే పూర్తయిన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు, అలాగే సర్వే పూర్తి కాని ప్రాంతాల్లో సర్వే చేస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేస్తామని వారు తెలిపారు.