వికారాబాద్, అక్టోబర్ 24 : పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. వైకుంఠధామాలు, కంపోస్ట్ యా ర్డులు, హరితహారం నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పల్లెలు కొత్త కాం తులను సంతరించుకున్నాయి. నవాబుపేట మండలం ఎల్లకొండ గ్రామం పరిశుభ్రంగా మారింది. నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రైతు వేదిక, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చాయి. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఎల్లకొండ గ్రామంలో 980 ఇండ్లు ఉండగా 3,774 మంది జనాభా ఉన్నారు. ప్రతి నెల వస్తున్న రూ.3.52లక్షల ప్రభుత్వ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటున్నారు. రూ. 12లక్షలతో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. 30గుంటల భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, అందులో 2వేల మొక్కలు పెంచుతున్నారు. రూ.22లక్షలతో రైతు వేదిక నిర్మా ణం పూర్తి చేసి ప్రారంభిచారు. గ్రామంలో 9 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం రోడ్లను శుభ్రం చేయడం, ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డులకు తరలిస్తుంటారు. మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో గ్రామం పూర్తిగా పరిశుభ్రంగా మా రింది. రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్క లతో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. మురుగు నీరు పారకుండా గ్రామాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం వివిధ రకాల మొ క్కలతో కనువిందు చేస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా శిథిలావస్థకు చేరిన 21 ఇండ్లను కూల్చి వేశారు. ప్రమాదకరంగా ఉన్న బావు లపై జాలిని అమర్చా రు. అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగే మొక్కలను నాటడంతో ఆకర్శణీయం గా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మొక్కలు నాటడంతో అవి వృక్షాలుగా మారి ఎంతో మందికి నీడనిస్తున్నాయి.
పల్లె ప్రగతి నిధులతో గ్రామాభివృద్ధి
గ్రామంలో పల్లెప్రగతి పథకాన్ని పూర్తి స్థాయిలో అ మలు చేశాం. ప్రభుత్వ సహకారంతో వచ్చిన నిధులను అధికారుల సూచన మేరకు ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేశాం ప్రజల సహకారం కూడా మరువలేనిది. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. అదనంగా మరో రెండు బోర్లు అందుబాటులో ఉన్నాయి. అండర్ డ్రైనేజీ పనులు జరుగు తున్నాయి. త్వరలో ఫార్మేషన రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తున్నాం.
-రావుగారి వెంకట్రెడ్డి, సర్పంచ్, ఎల్లకొండ
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన వైకుంఠధామం, కంపోస్ట్ యార్డు అం దుబాటులోకి వచ్చాయి. పల్లె ప్రకృతి వనంలో 2వేల మొక్కలను నాటించాం. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి 980 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని అందిస్తున్నాం. రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటి పంచాయతీ ట్యాంకర్తో నీళ్లు పోయిస్తున్నాం. రైతు వేదిక నిర్మాణం పూర్తి చేసి ప్రజా ప్రతినిధులతో ప్రారంభోత్సవం చేయించాం
-వెంకటలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి, ఎల్లకొండ