కొడంగల్, నవంబర్ 9 : పోడు భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎంపీడీవో మోహన్లాల్, డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చిట్లపల్లి, ఖాజాఅహ్మద్పల్లి, అన్నారం, నాగారం, రుద్రా రం గ్రామాల్లో పోడు భూములపై అధికారులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశా రు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2005 డిసెంబర్కు ముందు పోడు భూముల్లో సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న వారికి హక్కు కల్పించేందుకు గాను ప్రక్రియ కొన సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అటవీ, రెవెన్యూ అధికారులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు వెంకట్రెడ్డి, పట్లోళ్ల వెంకటలక్ష్మి, అనిత పాల్గొన్నారు.
అర్హులైన రైతులకు దరఖాస్తులు అందజేత
పెద్దేముల్, నవంబర్ 9 : పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం హక్కు పత్రాలను కల్పించేందుకు కృషి చేస్తున్నదని మండల డిప్యూటీ తహసీల్దార్ మోహన్, ఆర్ఐ రాజురెడ్డి, ధారూర్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ నరేశ్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మదనంతాపూర్, ఆత్కూర్ తండా, నాగులపల్లి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. గ్రామకమిటీలను ఎన్నుకొని, దర ఖాస్తుల నమూనా పత్రాలను అర్హులైన రైతులకు అందించారు. కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు గోవర్ధన్, శంకర్, మట్ట భాగ్యలక్ష్మి, ఎంపీడీవో లక్ష్మప్ప, అటవీశాఖ అధికారులు భాగ్యమ్మ, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్ మండలంలో…
దౌల్తాబాద్, నవంబర్ 9: మండలంలోని నంద్యానాయక్తండా, లొట్టిగుంటతండా, దేవర్ఫస్లవాద్ గ్రామాల్లో తహసీల్దార్ సర్దార్ హర్దీప్సింగ్ ఆధ్వర్యంలో పోడుభూములపై అవగాహనకల్పించారు. ఆయా గ్రామాల రైతులకు పంచాయతీ కార్యదర్శులు దర ఖాస్తులు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అటవీశాఖ ఆఫీసర్ నర్సింహులు, ఎంపీపీ రవీందర్, పంచాయతీ కార్యదర్శులు రమేశ్నాయక్, శ్రీశైలం పాల్గొన్నారు.
ప్రత్యేక గ్రామసభలతో అవగాహన
బషీరాబాద్, నవంబర్ 9: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు యా జమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేసున్నదని తాసిల్దార్ వెంకటస్వామి అన్నారు. సోమవారం మండల పరిధిలోని భోజ్యానాయక్తండా, వాల్యా నాయక్ తండాలో ప్రత్యేక గ్రామ సభలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. అం దులో భాగంగానే గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి కమిటీలను నియ మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు బీట్ అధికారి రాజేశ్, సర్పంచ్లు శాంతి, శివనాయక్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.