అమరావతి: టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.
‘జనం సామాన్యులకు పట్టం కట్టడంతో తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు. నామ్ కె వస్తే అధ్యక్ష పదవిని కూడా బాబు ఎక్కడ పీకుతాడోనని వణుకు. మీడియాలో వీరు చేసే విన్యాసాలను ఎవరూ నమ్మరు. అందుకే ఉత్తరాంధ్రలో ఒక్క చోటా కనీసం పోటీ ఇవ్వలేకపోయారని’ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.